ఆ తర్వాత సుముహూర్తం
ఒకరిపట్ల ఒకరికి అనురాగం కలగడానికి, భిన్నరుచులైన ఇద్దరు ఏకం కావడానికి జీలకర్ర బెల్లం కలిపిన ముద్దని శిరస్సు భాగంలో బ్రహ్మరంద్రం పైన వేదమంత్రాలతో శివాని నరేష్ గారి తలపైన , నరేష్ గారు శివాని తలపైన "జీలకర్ర -బెల్లం" పెట్టుకున్నారు.
ఆ తర్వాత మధుపర్కం అంటే పల్లికూతురికి , పెళ్ళికొడుక్కీ ఇద్దరికి పెళ్ళిభట్టలు పెడతారు , నరేష్ గారికి పంచె , శివానికి పెళ్ళిపట్టుచీర ఇంకా వల్లేవాటూ వేసి అందంగా ముస్తాబు చేశారు
ఆ పెళ్లి బట్టలతో పెళ్లి మండపం పైన వేదమంత్రాల నడుమ శివాని మెడలో నరేష్ గారు మంగళ సూత్ర ధారణ చేశారు . ఆది దంపతులు శివ పార్వతులలా ఆ జంట కనిపించారు.
ఆ తర్వాత ధాన్యలక్ష్మీ సంవృద్ధి గా ఉండాలని వధూవరులు ఇద్దరు అక్షితలు అంటే పసుపు కలిపిన బియ్యాన్ని ఒకరి తలపైన ఒకరు పోసుకుంటారు అదే "తలంబ్రాల వేడుక".
-